: తెలంగాణ చీఫ్ సెక్రటరీ పదవికోసం పరిశీలనలో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ ల పేర్లు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తోంది. దీంతో, కొత్త సీఎస్ నియామకానికి కసరత్తులు మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఐదుగురు సీనియర్ ఐఏఎస్ ల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరిలో, స్పెషల్ సీఎస్ క్యాడర్ కు చెందిన ప్రదీప్ చంద్ర, ఎంజీ గోపాల్, ఎస్పీ సింగ్, ఎస్కే జోషి, కేంద్రంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న బినయ్ కుమార్ ల పేర్లు ఉన్నాయి. సమర్థవంతమైన అధికారిని ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సీనియారిటీ విషయంలో రాజీవ్ శర్మ తర్వాత ప్రదీప్ చంద్ర మొదటి వరుసలో ఉన్నారు. ఈయన 1982 బ్యాచ్ కు చెందినవారు.

More Telugu News