: చైనా బొగ్గు గనిలో పేలుడు.. 13 మంది దుర్మరణం, 20 మంది ఆచూకీ గల్లంతు

చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 13 మంది కార్మికులు మృతి చెందగా మరో 20 మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. చాంగ్‌క్వింగ్ ప్రాంతంలోని జిన్షాన్‌గౌ గనిలో సోమవారం కార్మికులు విధుల్లో ఉండగా గ్యాస్ లీక్ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, మరో 20 మంది ఆచూకీ గల్లంతైంది. అయితే చనిపోయింది 13 మందేనని అధికారిక మీడియా పేర్కొంది. గనిలో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 13 మంది కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం 400 మంది సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.

More Telugu News