: విశాఖ వన్డే అప్ డేట్స్: మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా.. క్రీజులోకి కోహ్లీ
విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీమిండియా ఓపెనర్ రహానే న్యూజిలాండ్ బౌలర్ నీషామ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 24 పరుగులతోను, విరాట్ కోహ్లీ 3 పరుగులతోను ఉన్నారు. టీమిండియా స్కోరు 11 ఓవర్లకి 47గా ఉంది.