: లోకేష్ కు జడ్ కేటగిరీ భద్రత కల్పించుకునేందుకే చంద్రబాబు ఆ లేఖ సృష్టించారు: కల్యాణరావు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరసం నేత జి.కల్యాణరావు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, అతని కుమారుడు లోకేష్ ని హతమారుస్తామంటూ మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖ బూటకమని అన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఉంటున్న మావోలు ప్రాణత్యాగాలకు సిద్ధపడతారే తప్ప, ఆత్మాహుతి దాడులకు తెగించరని తెలిపారు. బూటకపు ఎన్ కౌంటర్ మాదిరే... ఇది బూటకపు లేఖ అని చెప్పారు. చంద్రబాబే ఈ లేఖను సృష్టించారని ఆరోపించారు. తన కుమారుడు లోకేష్ కు జడ్ కేటగిరీ భద్రతను కల్పించుకునేందుకు చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని విమర్శించారు.

More Telugu News