: 100 ప‌రుగుల మార్కును దాటిన న్యూజిలాండ్‌ స్కోరు.. గుప్తిల్ హాఫ్ సెంచరీ.. లాథ‌మ్ అవుట్‌

భారత్‌-న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య రాంచిలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో కొన‌సాగుతున్న నాలుగో వన్డేలో బ్యాటింగ్ చేస్తోన్న‌ న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 39 ప‌రుగులు చేసిన లాథ‌మ్.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంత‌రం క్రీజులోకి విలియ‌మ్స‌న్ వ‌చ్చాడు. ఓపెన‌ర్ గుప్తిల్ హాఫ్ సెంచ‌రీని త‌న ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ ప్ర‌స్తుత స్కోరు 108/1 (17 ఓవ‌ర్ల‌లో)గా ఉంది. గుప్తిల్ 54, విలియమ్సన్ 6 పరుగులతో మైదానంలో ఉన్నారు.

More Telugu News