: కేసీఆర్ కు బహిరంగలేఖ రాసిన జీవన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. వాస్తు పేరుతో సెక్రటేరియట్ ను పునర్నిర్మించడం మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పారు. వ్యక్తిగత నమ్మకాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ఆయన ప్రశ్నించారు. అన్నిటికన్నా ముందు ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొత్త జిల్లాల కలెక్టరేట్లకు సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

More Telugu News