: ఈ మూడు వ్యాధుల వల్లే మన దేశంలో ఎక్కువ మరణాలు

మన దేశంలో ఎక్కువ మంది గుండె జబ్బులు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల చనిపోతున్నారు. తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీటి తర్వాత షుగర్, మూత్రపిండ వ్యాధులు, న్యుమోనియా, అతిసారం, టీబీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారట. వ్యాధులే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ మందిని బలితీసుకుంటున్నాయని రీసర్చ్ తెలిపింది. 195 దేశాల్లో పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మరణాలకు కారణమవుతున్న వ్యాధుల సమాచారం వెల్లడైంది. పాశ్చాత్య జీవనశైలిని పాటించే క్రమంలో, మన దేశంలో అంటువ్యాధులు ఎక్కువ అవుతున్నాయని వెల్లడైంది. అయితే, జీవనశైలిని మార్చుకోవడం, యాంటీబయోటిక్స్ తో సత్వర చికిత్స చేయించుకోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సురక్షిత నీరు, పారిశుద్ధ్యం లేకపోవడంతో నెలలు నిండకుండానే చిన్నారులు మృత్యువాత పడుతున్నారని వారు తెలిపారు. ప్రతి ఏడాది మన దేశంలో కోటి కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు.

More Telugu News