: ఉగ్రవాద ముప్పు పెరుగుతున్నందున దానిపై సాధారణంగా ఉంటే సరిపోదు: సుష్మాస్వరాజ్

బ్రిక్స్ వేదికగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ను ఉగ్ర‌వాదానికి మాతృమూర్తిగా అభివ‌ర్ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ రోజు బ్రిక్స్‌ మీడియా ఫోరంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ... అంత‌ర్జాతీయంగా ఉగ్రవాద ముప్పు పెరుగుతున్నందున దానిపై సాధారణంగా ఉంటే సరిపోదని వ్యాఖ్యానించారు. ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తోన్న‌ ఉగ్ర‌వాదం పెద్ద స‌వాలుగా మారింద‌ని చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్స‌హించే ధోర‌ణితో ఉన్న‌వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

More Telugu News