: చిత్తూరులో తప్పిన ఘోరప్రమాదం.. గ్రిల్స్ను ఢీకొట్టిన బస్సు
చిత్తూరు జిల్లా హర్స్లీహిల్స్ ఘాట్రోడ్లో పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న గ్రిల్స్వైపుకి దూసుకెళ్లింది. ప్రయాణికులతో వస్తోన్న ఓ ప్రైవేటు బస్సు 3వ మలుపు దగ్గర గ్రిల్స్ను ఢీకొని అక్కడే ఆగిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ సహా ఎవ్వరికీ గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.