: ధోనీ రనౌట్... టీమిండియా స్కోరు 30 ఓవర్లలో 169/4

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ అయ్యాడు. 191 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతూ లక్ష్యానికి చేరువవుతోంది. అదే సమయంలో టీమిండియాను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో రోహిత్ (14), రహానే (33), పాండే (17)లను అవుట్ చేయగా, 29వ ఓవర్ నాలుగో బంతికి ఫీల్డర్ వద్దకు బంతిని తరలించిన కోహ్లీ, రన్ కాల్ ఇచ్చాడు. దీంతో ధోనీ క్రీజు మధ్యలోకి పరుగెత్తుకొచ్చాడు. మధ్యలోకి వచ్చిన తరువాత మళ్లీ వెనక్కి వెళ్లిపోమ్మని కోహ్లీ సూచించాడు. దీంతో ధోనీ వెనుదిరిగాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ధోనీ (21) 162 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. టీమిండియా 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (63)కి జతగా కేదార్ జాదవ్ ఉన్నాడు.

More Telugu News