: రేపటి నుంచి వరంగల్ లో దీక్షకు దిగనున్న రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక విధానాల‌ను చేప‌డుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి రేప‌టి నుంచి దీక్ష‌కు దిగ‌నున్నారు. రైతు స‌మ‌స్య‌లు ప‌రిష్కరించమంటూ వ‌రంగ‌ల్ లో ‘రైతు దీక్ష’ పేరిట ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఆయ‌న నిర‌స‌న తెల‌ప‌నున్నారు. రేపు ఉద‌యం హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భవ‌న్ నుంచి ర్యాలీగా బ‌య‌లుదేరి వ‌రంగ‌ల్ కు వెళ్ల‌నున్నారు. రైతు రుణ‌మాఫీ, బ్యాంకుల్లో కొత్త‌గా రుణాలు ఇవ్వ‌క‌పోవ‌డం, న‌కిలీ విత్త‌నాలతో రైతులు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స‌ర్కారుని నిల‌దీయ‌నున్నారు.

More Telugu News