: ఏడాది పాటు అమల్లో ఉండేలా బీఎస్ఎన్ఎల్ '1+1' ఆఫర్

ఈ పండగ సీజన్ లో ఎస్టీవీ (స్పెషల్ టారిఫ్ ఓచర్)ల ద్వారా రీచార్జ్ చేసుకునే ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ నాలుగు '1+1' ఆఫర్లను ప్రకటించింది. ఈ నాలుగు ఓచర్ రీజార్జ్ ల ద్వారా రెట్టింపు డేటాను అందుకోవచ్చని, ఏడాది పాటు ఈ డేటా చెల్లుబాటవుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 31 వరకూ ఎస్టీవీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో భాగంగా రూ. 1,498 రీచార్జ్ తో ప్రస్తుతం ఇస్తున్న 9 జీబీ స్థానంలో 18 జీబీ, రూ. 2,798 రీచార్జ్ తో 18 జీబీ స్థానంలో 36 జీబీ, రూ. 3,998 రీచార్జ్ తో 30 జీబీకి బదులు 60 జీబీ, రూ. 4,498 రీచార్జ్ తో 40 జీబీ స్థానంలో 80 జీబీ డేటాను అందుకోవచ్చని వెల్లడించింది. కస్టమర్లకు మరింత డేటాను అందించాలన్న లక్ష్యంతోనే ఈ ప్యాక్ లను అందిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్ కే మిట్టల్ ఈ ప్రకటనలో తెలిపారు.

More Telugu News