: సొంత బాబాయికే ఎసరు పెట్టిన ఘనత జగన్ ది: ఎమ్మెల్యే బోండ

ఎంపీ పదవి కోసం సొంత బాబాయికే ఎసరు పెట్టిన ఘనత వైఎస్ జగన్ ది అని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమా ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేశ్, చినరాజప్ప ఉన్న ఒక ఫొటోపై సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ విమర్శలు చేయడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. తమపై బురదచల్లే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. అవినీతి పరుడైన బొత్సకు టీడీపీ గురించి మాట్లాడే హక్కు లేదని బోండా అన్నారు.

More Telugu News