: కర్నూల్ జిల్లాలో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి

ఒక మహిళపై గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి జరిగిన విషాద సంఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు ఆ మహిళను ఆటోలో తీసుకువెళ్లారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై యాసిడ్ దాడి చేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆ నలుగురు వ్యక్తుల్లో సదరు మహిళ మాజీ ప్రియుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News