: తమిళనాట ఉత్కంఠ...అపోలోకు ప్రముఖులు...ఆందోళనలో అభిమానులు

తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఉన్న తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఉన్నారు. వారు పరామర్శించిన అనంతరం జయలలిత కేబినెట్ సహచరులంతా అపోలోకు క్యూకట్టారు. ఇప్పటికే జయలలితకు చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. గత 40 గంటలుగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్ద భారీగా బలగాలను మోహరించి, పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో వారిలో మరింత ఆందోళన రేగుతోంది. జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది.

More Telugu News