: జమ్ముకశ్మీర్‌లోకి చొర‌బ‌డ్డ ఉగ్ర‌వాదులు... కుల్గాంలో పోలీసు గ‌స్తీ ద‌ళంపై కాల్పులు

పీవోకేలోకి ప్ర‌వేశించి భార‌త సైన్యం ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చినప్ప‌టికీ ఉగ్ర‌వాదులు ఈరోజు మ‌రోసారి దేశంలోకి చొర‌బ‌డ్డారు. భార‌త్‌ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో కేంద్రం భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రింప‌జేసిన విష‌యం తెలిసిందే. జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాంలోనూ భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రింప‌జేశారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జ‌వాన్లు సంయుక్తంగా గ‌స్తీ నిర్వ‌హిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డ చొర‌బ‌డ్డ‌ ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా వారిపై కాల్పులు జ‌రిపారు. ఉగ్ర‌దాడిని బ‌ల‌గాలు తిప్పికొడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News