: జైష్-ఎ-మహ్మద్ చీఫ్ ఆ వ్యాఖ్యలు చేసి 10 రోజులు కూడా కాలేదు... తడాఖా చూపించిన భారత్ సైన్యం!

పాకిస్థాన్ శిబిరాలపై, జీహాదీలపై, ముజాహిదీన్లపై దాడి చేసి వారిని మట్టుబెట్టినట్లుగా బాలీవుడ్ సినిమాల్లో చూపిస్తుంటారని, అవన్నీ సినిమాలకే పరిమితమని హేళన చేస్తూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించి ‘రంగొనూర్’ అనే వెబ్ సైట్ లో సుమారు పదిరోజుల క్రితం ఒక ఆడియోను పోస్ట్ చేశాడు. ఉర్దూ భాషలో ఉన్న ఈ ఆడియో నిడివి సుమారు 10 నిమిషాలు ఉంటుంది. ‘ది రియల్ ఫౌంటెన్ హెడ్ ఆఫ్ పవర్’ అనే టైటిల్ తో వచ్చిన ఈ ఆడియోలో బాలీవుడ్ సినిమాల్లోని హీరోలు వారి నీడను చూసి వాళ్లే భయపడుతుంటారని, వాళ్ల ఒంటినిండా ఒట్టి చెత్త తప్ప మరేమీ ఉండదని విమర్శించాడు. సినిమాలో ముజాహిదీన్లపై తూటాల వర్షం కురిపించే ఈ హీరోలకు ఒక్క బుల్లెట్ కూడా తగలదంటూ హేళన చేశాడు. గమ్మత్తేమిటంటే, మసూద్ అజహర్ ఈ వ్యాఖ్యలు చేసి పది రోజులు కూడా పూర్తి కాకముందే ... నిన్న అర్ధరాత్రి భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి నిర్దేశిత దాడులు నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టడం గమనార్హం.

More Telugu News