: వరంగల్ రైల్వే స్టేషన్ లో కోటిన్నర విలువ చేసే 4 కేజీల బంగారం స్వాధీనం

వరంగల్ రైల్వే స్టేషన్‌ లో రైల్వే పోలీసులు సుమారు కోటిన్నర విలువైన 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ బంగారాన్ని తీసుకొస్తున్నట్టు గుర్తించారు. దీంతో నాలుగు కేజీల బంగారాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వేపోలీసులు బంగారం తీసుకువస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగారం ఎవరిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వంటి వివరాలు కూపీ లాగుతున్నారు.

More Telugu News