: సాగర్కు నీళ్లు రాకుండా అడ్డుకుంటోంది... ఏపీ ప్రభుత్వంపై హరీశ్రావు ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మండిప‌డ్డారు. హైదరాబాద్లో ఈరోజు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతో ఆయ‌న స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేశారు. శ్రీశైలం నుంచి సాగర్కు నీళ్లు రాకుండా ఆ రాష్ట్ర స‌ర్కారు ఆటంకాలు ఏర్ప‌రుస్తోంద‌ని అన్నారు. అంతేగాక‌, పోతిరెడ్డిపాడు నుంచి ఆ రాష్ట్రం నీటిని తీసుకుంటోంద‌ని చెప్పారు. దీనిపై స్పందించి వెంట‌నే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News