: మెదక్ జిల్లాలో వరదలో చిక్కుకున్న ఇద్దరు... కాపాడేందుకు స్వయంగా బయలుదేరిన పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చిన్న చిన్న వాగులు వంకలు సైతం నదులను తలపిస్తూ, ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా, సంగీగూడ తండాను వరదనీరు ముంచెత్తింది. నీటిలో చిక్కుకున్న ఇద్దరు రైతులు సమీపంలోని చెట్టు ఎక్కి తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఏడుపాయలలో మంజీరా నీటిలో చిక్కుకున్న 24 మందిని కాపాడిన హెలికాప్టర్ ను తీసుకుని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా మెదక్ ప్రాంతానికి బయలుదేరారు. మరో గంటలో చెట్లపై ఉన్న రైతులను కాపాడుతామని ఆమె తెలిపారు. మరోవైపు రంగారెడ్డిలో కురుస్తున్న వర్షాలకు తాండూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో మాత్రం ఈ ఉదయం నుంచి వర్షం కురవలేదు. చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తుండటం గమనార్హం.

More Telugu News