: నేనెవరికీ భయపడను.. కేంద్రంతో పోరాడుతున్నా: చంద్రబాబు

తాను ప్రజలకు తప్ప మరెవరికీ భయపడనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తనకు హైకమాండ్ ఎవరూ లేరని, తనకు ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు సహా పలువురు కాంగ్రెస్, వైసీపీ జిల్లా నేతలు శుక్రవారం రాత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవడం ఒక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తానని పేర్కొన్నారు. అభివృద్ధిని ఓర్వలేని కొందరు వాళ్ల ఊరికి నీరు ఇస్తామన్నా వద్దని అంటున్నారని బాబు విమర్శించారు. ప్రజలు అభివృద్ధి చెందితే వారి మాట ఎక్కడ వినరోననేది వారి భయానికి కారణమన్నారు. భవిష్యత్తులో రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లకు నీరు అందిస్తామన్నారు. అవినీతి రహిత పాలనే తన ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో పోరాడుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News