: బ్రహ్మానందం గారి పక్కన నిలబడితే చాలనుకున్నాను: పృథ్వీ

‘బ్రహ్మానందంగారి పక్కన నిలబడితే చాలనుకునే వాడిని. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన కమెడియన్ ఆయన. ఆ రేంజ్ కి చేరుకోవడం చాలా కష్టం’ అని సినీ హాస్యనటుడు పృథ్వీ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మొన్నామధ్య బ్రహ్మానందంగారు నాకు ఫోన్ చేశారు. నువ్వు పడిన కష్టాలకు ఈరోజు మంచి పొజిషన్ కు చేరుకున్నావన్నారు. ఈ పొజిషన్ ను జాగ్రత్తగా కాపాడుకోమని ఆయన చెప్పారు. నాకు బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారికి నేను కాంపిటీటర్ ని కాదు. ఇండస్ట్రీలో 30 నుంచి 40 మంది కమెడియన్లు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్’ అని అన్నారు.

More Telugu News