: ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళా ప్రేమికులు

ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలను పోలిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే... ముంబైలోని చున్నభట్టికి చెందిన అదితి, అదే ప్రాంతానికి చెందిన షీతల్ కు ఒకరంటే ఒకరికి ఇష్టం. ఈ ఇష్టం స్నేహంగా, ఈ స్నేహం హద్దులు దాటిన ప్రేమగా మారింది. తామిద్దరం స్త్రీలమే అయినప్పటికీ, అందులో తప్పేముందని భావించి, ప్రేమించుకున్నారు. దీంతో జీవితాంతం తోడుగా ఉండాలని బాసలు చేసుకున్నారు. ఈ విషయాన్ని తమ కుటుంబాల పెద్దలకు చెప్పారు. వారు దీనికి అంగీకరించకపోగా, బుద్ధిగా ఉండండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో, ఇక తాము కలిసి వుండేది లేదని భావించిన వారిద్దరూ... చావులో కలిసి ఉండాలని భావించి, ఒకే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఒకరు, ఫినాయిల్ తాగి మరొకరు ప్రాణం విడిచారు.

More Telugu News