: గవర్నర్ నరసింహన్ తో సుజనా చౌదరి కీలక భేటీ!
కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ ఉదయం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమావేశం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై ముసాయిదా సిద్ధమైన వేళ, గవర్నర్ ను కలుసుకుని సుజనా చర్చలు జరపడం గమనార్హం. అమిత్ షా, జైట్లీలతో తమ చర్చల సారాంశం, ముసాయిదాలో చేర్చిన అంశాలపై నరసింహన్ కు వివరించేందుకే సుజనా చౌదరి వచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలివారంలో ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం నుంచి ప్రకటన వెలువడుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్ కు తాజా పరిస్థితులను సుజనా తెలిపినట్టు సమాచారం.