: కెరమెరి ఎస్‌ఐది ఆత్మహత్యే.. తేల్చి చెప్పిన పోలీసు అధికారులు

ఆదిలాబాద్‌లోని కెర‌మెరిలో తుపాకి పేలి ఆ ప్రాంత ఎస్ఐ కె.శ్రీ‌ధ‌ర్‌(27) మృతి చెందిన ఘటన ఈరోజు ఉద‌యం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. పోలీసు క్వార్టర్స్‌లో తీవ్ర‌గాయాల‌తో ప‌డి ఉన్న ఆయ‌న‌ను ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేక‌పోయింది. శ్రీ‌ధ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ పోలీస్‌క్వార్టర్స్ ను అదనపు ఎస్పీలు జి.ఆర్‌. రాధిక, విజయ్‌కుమార్‌ పరిశీలించి తుపాకి ప్ర‌మాద‌వశాత్తు పేలిందా? లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా? అనే అంశంపై ఆరా తీశారు. అనంత‌రం ఎస్ఐ ఒత్తిడి భరించలేకే తుపాకితో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తేల్చిచెప్పారు. శ్రీ‌ధ‌ర్‌ క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల ముస్తాబాద్‌ మండలం ఆవునూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. మూడు నెల‌ల నుంచి కెర‌మెరిలో ట్రైనీ ఎస్ఐగా ఆయ‌న ప‌నిచేసి, తాజాగా అదే పీఎస్ లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడని పేర్కొన్నారు.

More Telugu News