: కోడెల కొడుక్కి అంబటి రాంబాబు సారీ చెప్పాలట!...లేదంటే క్రిమినల్ కేసులు తప్పవంటున్న లాయర్లు!

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణకు సారీ చెప్పకుంటే... వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి... క్రిమినల్, సివిల్ కేసులు ఎదుర్కోక తప్పదట. ఈ మేరకు నిన్న గుంటూరులో శివరామకృష్ణ తరఫు న్యాయవాదులు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ సారీకి వారు కేవలం 48 గంటల డెడ్ లైన్ ను విధించడం గమనార్హం. అసలు విషయమేంటంటే... శివరామకృష్ణకు సంబంధం లేని విషయాల్లో ఆయనపై అంబటితో పాటు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసత్య ఆరోపణలు చేశారట. ఈ విషయం తెలుసుకున్న శివరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన న్యాయవాదులను ఆయన రంగంలోకి దించారు. అసత్య ఆరోపణలకు సంబంధించి అంబటి, గోపిరెడ్డిలు 48 గంటల్లోగా శివరామకృష్ణకు సారీ చెప్పాలని, లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ కోడెల లాయర్లు నిన్న ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

More Telugu News