: నటి రమ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి

పాకిస్తాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత, ప్రముఖ కన్నడ నటి రమ్య ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. కర్ణాటకలోని మంగళూరులో స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా తన వాహనంపై ఈ దాడి జరిగిందని రమ్య పేర్కొంది. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయం తనకు తెలియదని చెప్పింది. కాగా, పాకిస్తాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నటి రమ్యపై దేశ ద్రోహం కేసు(ప్రైవేటుగా) నమోదైంది.

More Telugu News