: పుష్కరాలకు రావాలంటూ సింధుకు చంద్రబాబు ఆహ్వానం

రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విజేత పివి సింధుకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ నెల 23న కృష్ణా పుష్కరాలు, హారతి కార్యక్రమం తిలకించేందుకు రావాలంటూ ఈ సందర్భంగా సింధుకు ఆయన ఆహ్వానం పలికారు. పుష్కర ఆహ్వానానికి సింధు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. హైదరాబాద్ కు రేపు చేరుకోనున్న సింధును ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని స్వయంగా కలిసి ఆమెకు పుష్కర ఆహ్వానం అందజేస్తారు.

More Telugu News