: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం

రియో ఒలింపిక్స్ లో స్వల్ప పాయింట్ల తేడాతో కాంస్య పతకం కోల్పోయిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించింది. ‘రియో’లో నాల్గో స్థానంలో నిలిచిన ఆమెకు రూ.50 లక్షల ప్రోత్సాహకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా, త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ ప్రొడునోవా విన్యాసం చేయడంలో దిట్ట. ప్రాణాలు తీసే విన్యాసంగా భావించే ప్రొడునోవా అంటే తనకెంతో ఇష్టమని దీప ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

More Telugu News