: మోదీ రెడ్ లైన్ దాటారు...కాశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తాం: పాకిస్థాన్

పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌, గిల్గిత్, పీవోకేలలో చేస్తున్న అరాచకాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామని, బలూచిస్థాన్ స్వాతంత్ర్య సాధనలో అక్కడి ప్రజలకు మద్దతిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించడంపై పాకిస్థాన్ మండిపడుతోంది. తమ దేశానికి సంబంధించిన బలూచిస్తాన్‌ పై మాట్లాడి నరేంద్ర మోదీ 'రెడ్‌ లైన్' దాటారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. బలూచిస్తాన్‌ గురించి మాట్లాడటం ద్వారా భారత ప్రధాని ఐక్యరాజ్యసమితి (యూఎన్) నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. త్వరలో జరగనున్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో కాశ్మీర్ అంశాన్ని మరింత బలంగా వినిపిస్తామని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం, మానవహక్కుల సంస్థలు కాశ్మీర్‌ విషయంలో స్పందించి, భారత బలగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

More Telugu News