: చెట్టుకు రాఖీ కట్టిన లాలూ ప్రసాద్ యాదవ్!

దేశ వ్యాప్తంగా ఈ రోజు రక్షా బంధన్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు రాఖీ పండగను మామూలుగానే జరుపుకున్నప్పటికీ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం చాలా విభిన్నంగా ఈ పండగను నిర్వహించారు. తన నివాసంలోని ఒక చెట్టుకు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక రాఖీని కట్టారు. ఇలా ఎందుకు చేశారనే ప్రశ్నకు ఆయన సమాధానమేమిటంటే, చెట్లు సైతం తనకు కుటుంబ సభ్యులతో సమానమని, అందుకే వాటిలో ఒక చెట్టుకు రాఖీ కట్టానని చెప్పారు. లాలూ విభిన్నంగా జరుపుకున్న ఈ రాఖీ పండగపై ఆయన అభిమానులు, పర్యావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News