: పారా హుషార్... పుష్కరాల్లో దిగిన బీహార్, ఒడిశా 'బ్యాచ్'లు...వెల్లువెత్తున్న ఫిర్యాదులు!

పారా హుషార్ అంటూ కృష్ణా పుష్కరాల్లో పాల్గొంటున్న భక్తులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో బీహార్, ఒడిశాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చేస్తున్నాయని వారు తెలిపారు. ఈ మధ్యాహ్నం పది మంది మహిళల ముఠాను పట్టుకున్నామని, వారి నుంచి భారీ ఎత్తున నగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే ఆభరణాలు పోయాయంటూ వందలాది మంది మహిళల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని, పుష్కరాల్లో పాలు పంచుకునే భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దొంగలు పురుషులు కాదని, మహిళలేనని, చాకచక్యంగా మాటల్లో దింపి ఆభరణాలు కాజేస్తున్నారని వారు తెలిపారు.

More Telugu News