: అమెరికా వెళ్లనున్న బాబా రాందేవ్‌

యోగా గురువు బాబా రాందేవ్ అమెరికా వెళ్లనున్నారు. భారత్ ఎల్లుండి 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈనెల 21న‌ న్యూయార్క్‌లో పరేడ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బాబా రాందేవ్‌ను ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా తాము ఆహ్వానించిన‌ట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌(ఎఫ్‌ఐఏ) పేర్కొంది. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాందేవ్ అక్క‌డి హూస్టన్‌ నగరంలో యోగా శిబిరాన్ని కూడా నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఆయ‌న కెనడాలోని ఒంటారియో, హూస్టన్‌ నగరాల్లోనూ ప‌ర్య‌టించి యోగాను ప్రోత్స‌హిస్తారు.

More Telugu News