: దినేశ్ రెడ్డి ప్రెస్ మీట్ రద్దు కాలేదు!... వేదిక మారిందంతే!

మాజీ డీజీపీ వి.దినేశ్ రెడ్డి మీడియా సమావేశం రద్దు కాలేదట. ఐపీఎస్ అదికారిగా పదవీ విరమణ చేసిన దినేశ్ రెడ్డి గడచిన ఎన్నికలకు ముందు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. గ్యాంగ్ స్టర్ నయీమ్ తో దినేశ్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలతో నేటి మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు దినేశ్ రెడ్డి మీడియా ప్రతినిధులకు సమాచారం పంపారు. అయితే బీజేపీ అధిష్ఠానం ఆగ్రహంతో మనసు మార్చుకున్న దినేశ్ రెడ్డి మీడియా సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ ప్రకటన మీడియా ప్రతినిధులందరికీ చేరేలోగానే దినేశ్ రెడ్డి నుంచి మరో ప్రకటన విడుదలైంది. బీజేపీ కార్యాలయంలో కాకుండా హైదరాబాదులోని ఓ ప్రైవేటు హోటల్ లో ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తాజా ప్రకటనలో దినేశ్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News