: 'ఆప్' ఎమ్మెల్యే ఇంట్లో రూ.130 కోట్లు పట్టివేత

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఛత్తర్ పూర్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ నివాసంపై ఐటీ అధికారులు ఈ రోజు దాడులు నిర్వహించారు. లెక్కల్లో చూపించని రూ.130 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తర్ పూర్, ఘితోర్నిలో ఫామ్ హౌస్ ల కొనుగోలుకు సంబంధించిన అకౌంట్ పుస్తకాలను, లెక్కల్లో చూపించని, బినామీ ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు ఐటీ సోదాల్లో పట్టుబడినట్లు తెలుస్తోంది. కాగా, తన్వర్ కు చెందిన సౌత్ ఢిల్లీ నివాసంపై గత నెల 27న ఐటీ సోదాలు నిర్వహించింది.

More Telugu News