: గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి అమిత్ షానే... జోస్యం చెప్పిన ఢిల్లీ సీఎం

గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆనందీబెన్ పటేల్ తప్పుకుంటున్న నేపథ్యంలో ఆమె స్థానాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భర్తీ చేయనున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడం, రాష్ట్రంలో ‘ఆప్’కు మద్దతు పెరుగుతుండడంతోనే ఆనందీబెన్‌ను తప్పిస్తున్నట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆమె స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ముఖ్యమంత్రిని చేయాలని మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు.

More Telugu News