: 27 ఓవర్లలో 72 పరుగులు చేసిన టీమిండియా

వెస్టిండీస్‌ తో ఆంటిగ్వాలో ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా 27 ఓవర్లలో వికెట్ కోల్పోయి 72 పరుగులు చేసింది. టెస్టు మజాను రుచి చూపిస్తూ టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్ (46), మురళీ విజయ్ (7) ఆచితూచి ఆడారు. డేనియల్ వేసిన చక్కని బంతిని ఆడిన మురళీ విజయ్ ను బ్రాత్ వైట్ ఒడిసి పట్టడంతో తొలి వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ ను ధావన్ తో కలిసి ఛటేశ్వర్ పూజారా (14) ముందుకు నడిపించాడు. వీరిద్దరూ పోటాపోటీగా డిఫెన్స్ ఆడుతూ బౌలర్లను విసిగిస్తున్నారు. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి భారత జట్టు 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. కొత్త బంతి అందుకున్న గాబ్రియెల్ ఒక వికెట్ తీశాడు.

More Telugu News