: ఫ్రాన్స్ దాడిలో 2 కిలో మీటర్ల మేర జనాన్ని ట్రక్కుతో ఢీకొట్టి ఉగ్రవాది బీభత్సం!

ఫ్రాన్స్ నగరం నీస్ లో తాజా ఉగ్రవాద దాడిలో సింగిల్ గానే వచ్చిన ఉగ్రవాది 75 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరో 100 మందికి పైగా జనాన్ని ఆసుపత్రి పాలు చేశాడు. దాడి జరిగిన తీరును పరిశీలిస్తే సదరు ముష్కరుడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో అర్థమవుతోంది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నింపుకున్న ఓ పెద్ద ట్రక్కుతో బాస్టిల్ వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఆ ఉగ్రవాది... జనంపైకి వాహనాన్ని దూకించాడు. జనంతో రద్దీగా ఉన్న రోడ్డుపై దాదాపు 2 కిలో మీటర్ల మేర వాహనాన్ని ఆపకుండా పరుగులు పెట్టించాడు. ఈ కారణంగానే ట్రక్కు కింద పడి నలిగిపోయిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. ఇక ట్రక్కు తగిలి పక్కకు ఎగిరిపడ్డ వారు తీవ్ర గాయాలపాలయ్యారు. వేగంగా ట్రక్కు దూసుకువస్తున్న విషయాన్ని గమనించిన వారంతా ప్రాణభయంతో పరుగులు తీసి తప్పించుకోగలిగారు. 2 కిలో మీటర్ల దాకా వాహనంతో వేగంగా దూసుకువెళ్లిన ఉగ్రవాది... తాను ముందుగా నిర్దేశించుకున్న ప్రదేశంలో ట్రక్కును ఆపేసి సమీపంలోని రెస్టారెంట్ లోకి చొరబడ్డాడు. అయితే వేగంగా స్పందించిన పోలీసులు సదరు రెస్టారెంట్ పై ముప్పేట దాడికి దిగి అతడిని మట్టుబెట్టారు.

More Telugu News