: అమరావతిలో ప్రారంభోత్సవాల హడావుడి!

హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివస్తున్న శాఖల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నేడు విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మొత్తం 13 రాష్ట్ర కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ నక్కల రోడ్డులోని పాత చరితశ్రీ ఆసుపత్రి భవనంలో పంచాయితీ రాజ్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయాన్ని, మారుతీ నగర్ లోని జీపీఆర్ స్ట్రీట్ లో ఉన్న వీ ప్లాజాలో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసును, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న జెడ్పీ ఆఫీసులో పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారు. ప్రసాదంపాడులో అద్దెకు తీసుకున్న భవంతిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ ఆఫీసులను ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించనున్నారు. గొల్లపూడిలో ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని అయ్యన్నపాత్రుడు, అక్కడే సెర్ప్ ఆఫీసును కిమిడి మృణాళిని, శాప్ కార్యాలయాన్ని చైర్మన్ మోహన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మంత్రి గంటా, బస్ భవన్ ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

More Telugu News