: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బ్రెగ్జిట్ ఫలితాల ప్రభావం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 604 పాయింట్లు నష్టపోయి 26,397 పాయింట్ల వద్ద ముగిస్తే, నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 8,088 పాయింట్ల వద్ద ముగిసింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, గెయిల్ సంస్థల షేర్లు స్వలంగా లాభపడ్డాయి. టాటా గ్రూప్ నకు చెందిన మూడు సంస్థలు టాటా మోటార్స్, టాటా మోటార్స్(డీ), టాటా స్టీల్ భారీ నష్టాలతో ముగిశాయి. హిందాల్కో, టెక్ మహీంద్రా సంస్థల షేర్లు కూడా నష్టాల బాట పట్టాయి.

More Telugu News