: 'బ్రహ్మోత్సవం' ఆడియో వేడుక కాసేపట్లో ప్రారంభం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' ఆడియో వేడుక కాసేపట్లో హైదరాబాదులోని జెఎఫ్ సీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతోంది. ఒకవైపు హైదరాబాదులో వర్షం కురుస్తున్నప్పటికీ ఆడియో వేడుకకు మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. కాసేపట్లో ఆడియో వేడుక వేదిక వద్దకు మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత హాజరుకానున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం మిక్కీ జే మేయర్ అందించారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందినట్టు సినిమా యూనిట్ తెలిపింది.

More Telugu News