: బర్త్ డే బాయ్ రో‘హిట్’ శర్మ!... బీసీసీఐ, ఐసీసీ నుంచి వెల్లువలా గ్రీటింగ్స్!

టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 29 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. నేటి తెల్లవారుజామునే భార్య రితిక, సన్నిహితుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేసిన రోహిత్... 30వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఓ గుర్తింపును రోహిత్ సాధించాడు. ఆరంభంలో నిలకడ లేమితో సతమతమైన రోహిత్... ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సత్తా చాటాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలోనే ఏ ఒక్కరికీ సాధ్యం కాని ఫీట్ ను అతడు సాధించాడు. వన్డే క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన అతడు... వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు(264)ను తన పేరిట లిఖించుకున్నాడు. అందుకే... భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన బర్త్ డే విషెస్ లో ఐసీసీ... రోహిత్ ను ఆకాశానికెత్తేసింది. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్ గానే కాక తక్కువ సమయంలోనే 5 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడని అతడిని ఐసీసీ కీర్తించింది.

More Telugu News