: విండీస్ జట్టు విజయ లక్ష్యం 156

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ స్కోరు: జోస్ రాయ్(0), హేల్స్(1), జో రూట్ (54), మోర్గాన్ (5), బట్లర్ (36), స్టోక్స్ (13), అలీ (0), విల్లే (21), ప్లంకెట్ (4), రషీద్ 4 పరుగులు చేయగా, జోర్డాన్ (12), రషీద్(4) లు నాటౌట్ గా నిలిచారు. వెస్టిండీస్ బౌలింగ్ : డీజే బ్రావో, సీఆర్ బ్రాత్ వైట్ లు చెరో మూడు వికెట్ల చొప్పున, బద్రి రెండు వికెట్లు, రస్సెల్ ఒక వికెట్ పడగొట్టారు.

More Telugu News