: రాహుల్ ద్రావిడ్ కు కోచ్ గా చాన్స్!

నేటితో ముగియనున్న వరల్డ్ కప్ టీ-20 పోటీల అనంతరం టీమిండియాకు చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను నియమించవచ్చని తెలుస్తోంది. దిగ్గజ త్రయం సచిన్, సౌరవ్, లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ సలహా సంఘం ఈ మేరకు ద్రావిడ్ పేరును ప్రస్తావిస్తూ, ఆయన్ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అండర్ 19తో పాటు భారత ఏ జట్టుకు ద్రావిడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ద్రావిడ్ కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు, 2019 వరల్డ్ కప్ వరకూ చీఫ్ కోచ్ గా ఉంచుతామన్న హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ద్రావిడ్ ఇంకా స్పందించ లేదని సమాచారం. కాగా, టీ-20 పోటీల అనంతరం డైరెక్టరుగా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండటంతో మరో డైరెక్టరును వెతికి పట్టే పనిలోనూ బీసీసీఐ నిమగ్నమై ఉంది.

More Telugu News