: ప్రతివిషయాన్ని సెన్సేషన్ చేయద్దు: జర్నలిస్టులకు గవర్నర్ సూచన

'జర్నలిస్టులూ.. ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేయకండి' అంటూ గవర్నర్ నరసింహన్ సూచించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. ఏ రంగంలోనైనా సరే, లోటుపాట్లు ఉంటే మీడియా ఎత్తి చూపాలే తప్పా, సంచలనాల కోసం చూడద్దని అన్నారు. ‘విమర్శలు చేయండి, కాకపోతే, అవి నిర్మాణాత్మకంగా ఉండాలి’ అని అన్నారు. మీడియా బాధ్యతాయుతంగా ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నరసింహన్ అన్నారు.

More Telugu News