: అవగాహన లేకే ఎయిర్ పోర్టులు వద్దంటున్నారు: అయ్యన్న పాత్రుడు

కొందరు నేతలు అవగాహనా లోపంతో ఎయిర్ పోర్టులు అడ్డుకుంటున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయాలు అవసరమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆయన విధానాలు అర్థం చేసుకోలేని నేతలు, అవగాహనలేమితో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపై అవగాహన లేని నేతలే ఎయిర్ పోర్టులను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజకీయాలు మాని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు.

More Telugu News