: సైకోను పట్టిస్తే రూ. 50 వేల బహుమతి

వారం రోజులుగా సంచలనం రేకెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకో వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు సైకోను పట్టుకోవడంలో పోలీసులు విఫలం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా సైకోను పట్టుకోవాలని ఐజీ, డీఐజీ, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో, సైకోను పట్టుకోవడానికి ప్రజల సహకారం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అంతేకాదు, సైకోను పట్టించిన వారికి రూ. 50 వేల నగదు బహుమతిని ప్రకటించారు.

More Telugu News