: షీనా బోరా హత్యోదంతంపై జోకులొద్దు: నెటిజన్లను మందలించిన సోనాక్షీ

మీడియాలో హాట్ టాపిక్ గా మారిన షీనా బోరా హత్యోదంతంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతుండడంపై బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా స్పందించారు. ఓ సీరియస్ అంశంపై ఇలా పరిహాసాలు తగదని హితవు పలికారు. అలాంటి జోకులను ఆమె ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఓ అమ్మాయి తన ప్రాణాలు కోల్పోతే ప్రజలు జోకులేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయమిది" అని పేర్కొన్నారు.

More Telugu News