: హైదరాబాదులో 'ఉత్తమ విలన్' ఆడియో వేడుక

భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ నటించిన 'ఉత్తమ విలన్' తెలుగు వెర్షన్ ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేశారు. ఈ ఆడియో లాంచ్ కు కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గౌతమి, రమేశ్ అరవింద్ తదితరులు విచ్చేశారు. ఈ సినిమాలో కమల్ సరసన ఆండ్రియా జెర్మియా, పూజా నాయర్ నటించారు. దివంగత దర్శకుడు బాలచందర్, తెలుగు దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలు పోషించడం విశేషం. దర్శకత్వం రమేశ్ అరవింద్, సంగీతం జిబ్రాన్ అందించారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై లింగుస్వామి, కమల్ హాసన్ నిర్మించారు.

More Telugu News