Jagan: ఈ రాత్రి విజయవాడ నుంచి లండన్ కు బయల్దేరుతున్న జగన్

Jagan leaving to London tonight

  • రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్ కు పయనం
  • ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లలో కూడా పర్యటించనున్న సీఎం
  • ఈ నెల 31న విదేశాల నుంచి తిరిగిరానున్న ముఖ్యమంత్రి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రాత్రి లండన్ కు బయల్దేరుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల బిజీలో ఉన్న జగన్ విశ్రాంతి కోసం తన భార్య భారతితో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ఈ రాత్రి 11 గంటలకు ఆయన విజయవాడ నుంచి లండన్ కు పయనమవుతున్నారు. జగన్ కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. లండన్ తో పాటు స్విట్జర్లాంట్ లో కూడా ఆయన పర్యటించనున్నారు.  ఈ నెల 31న ఆయన విదేశాల నుంచి తిరిగొస్తారు. 

విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును కోరారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే బెయిల్ కండిషన్ నేపథ్యంలో... ఆ షరతులను సడలించాలని కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతిని ఇవ్వాలని విన్నవించారు. జగన్ పర్యటనకు సీబీఐ అభ్యంతరం తెలిపింది. అయితే, జగన్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. 

  • Loading...

More Telugu News